Wednesday, August 5, 2015



"4 ఆగష్టు 1967 భారత ప్రధాని శ్రీమతి ఇందిరాగాంధి గారు నాగార్జున సాగర్ డ్యాం ను జాతికి అంకితమిచ్చిన సందర్భంగా నాన్నగారు క్రీ.శే. శ్రీ కొరటమద్ది నరసింహయ్య గారు రచించిన కవిత ఇది"
||నాగార్జున సాగరం||
1. సాగరం సాగరం నాగార్జున సాగరం
నెహ్రూజీ కలలు కన్న దేవాలయం
తెలుగు రైతన్న కైవల్య సోపానం
ఆరుకోట్ల ఆంధ్రుల ఆశాసౌదం
2.కార్మికుల అవిశ్రాంత శ్రమఫలం
మేధావుల నిర్విరామ కృషి ఫలం
భారత సాంకేతిక విజ్ఞానపు పెన్నిధానం
జగద్విఖ్యాత ఘన నిర్మాణం
3.మిస మిసలాడే పసిడిపొలాల
జలాల నింపే కుడి ఎడమ స్రవంతుల
జల జల మంజులనిస్వనములతో
విద్యుల్లతల ప్రదిమల కాంతులతో
ప్రతిఫలించిన జలనిధిశోభలతో
4.ఝళం ఝళత్ మంజీరరవమ్ములతో
గళం గళత్ కంకణ నిక్వణముల సందోహమ్ములతో
కృష్ణవేణమ్మకు నడుము వడ్డాణమై
వెలసె సాగరం నాగార్జున సాగరం
5.కండలు పిండి పారణమిచ్చిన కార్మికులకు
ఒడలు వంచి రుధిర తర్పణమిచ్చిన శ్రామికులకు
పంటపొలాల ఫలసాయము తెచ్చే సామాన్యులకు
అంకిత మిచ్చిన సాగరం నాగార్జున సాగరం
ఇదే అభినవ దేవాలయం ...!!
"రచన క్రీ.శే. శ్రీ కొరటమద్ది నరసింహయ్య గారు"

No comments:

Post a Comment